రైల్వేలో 2422 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు

రైల్వేలో 2422 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులున్యూఢిల్లీ : భారతీయ రైల్వేలో భాగమైన సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గలవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 16 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ వర్క్ షాప్ లు, యూనిట్లలో 2422 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఎలాంటి రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

మొత్తం ఖాళీలు : 2422 , ఇందులో ముంబైలో 1659, నాగ్ పూర్ లో 114, పుణె 151, భుస్వాల్ లో 418, షోలాపూర్ 79 చొప్పున ఖాళీలున్నాయి.

అర్హతలు : సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు 15 నుంచి 24 యేండ్లలోపువారై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ : ఐఐటీ, మెట్రిక్యులేషన్ లో వచ్చిన మార్కుల ఆధారంగా,
దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో
దరఖాస్తు ఫీజు : రూ.100
దరఖాస్తులకు చివరి తేదీ : ఫిబ్రవరి 16
వెబ్ సైట్ : https://rrccr.com/