2వ రోజు మల్లన్నసేవలో ఎన్వీ రమణ దంపతులు

2వ రోజు మల్లన్నసేవలో ఎన్వీ రమణ దంపతులు

వరంగల్ టైమ్స్, శ్రీశైలం : సోమవారం తెల్లవారుజామున శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి మహా మంగళహారతి దర్శనానికి విచ్చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ దంపతులకు ఆలయ రాజగోపురం వద్ద మంగళవాయిద్యాలతో అర్చక స్వాములు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం చీఫ్ జస్టిస్ ఎన్.వీ రమణ దంపతులు రత్నగర్భ గణపతి పూజ, శ్రీ మల్లికార్జున స్వామి వారి సుప్రభాత సేవ, మహా మంగళ హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. గర్భగుడిలోని మూలవిరాట్ కు మహాన్యాస రుద్రాభిషేకం చేశారు అనంతరం భ్రమరాంబ అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు.2వ రోజు మల్లన్నసేవలో ఎన్వీ రమణ దంపతులుఅనంతరం వారు వేద పండితుల నుండి ఆశీర్వచనం తీసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఎన్వీ రమణ దంపతుల వెంట తెలంగాణ చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ దంపతులు, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ప్రసన్నకుమార్ సూర్యదేవర, ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వి. రవీంద్రబాబు, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ యం.హరిజవహర్ లాల్, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు దేవస్థాన ఈవో లవన్న తదితరులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లు వున్నారు.