మార్చి 28 నుంచి బ్యాంక్ ఉద్యోగుల సమ్మె 

మార్చి 28 నుంచి బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బ్యాంకింగ్ ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టారు. ఈనెల 28 నుంచి 29 వరకు రెండ్రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు పలు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఇందుకు సంబంధించి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీవోఏ) ఉద్యోగ సంఘాలు నోటీసులు ఇచ్చాయి. మార్చి 28 నుంచి బ్యాంక్ ఉద్యోగుల సమ్మె దీంతో బ్యాంకింగ్ సేవలు వరుసగా 4 రోజులు కస్టమర్లకు దూరమవుతున్నాయి. 26 నాలుగో శనివారం, 27 ఆదివారం , ఆ తర్వాత రెండ్రోజులు సమ్మె. పలు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె చేస్తున్నట్లు, దీంట్లో అన్ని యూనియన్లకు సంబంధించిన ఉద్యోగులు హాజరుకావాలని ఏఐబీఈఏ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఈ సమ్మె ప్రభావం పడకుండా ఉండేందుకు బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ, పీఎన్బీలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి.