తిరుమల: ప్రకాశం జిల్లాకు చెందిన చిత్రకారుడు కత్తి కోటేశ్వరరావు తాను గీసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతుల చిత్రపటాన్ని మంగళవారం రాష్ట్రపతికి అందించారు. తిరుమలలోని పద్మావతి విశ్రాంతి గృహంలో టిటిడి చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి చేతుల మీదుగా ఈ చిత్రపటాన్ని రాష్ట్రపతికి అందజేశారు.