మెల్బోర్న్ : ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ మొదటి టెస్టులో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న భారత్ రెండో టెస్టు చివరి జట్టు కూర్పుపై దృష్టిసారించింది. పేసర్ మహ్మద్ షమీ గాయంతో సిరీస్కు దూరమవడం, కెప్టెన్ విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్లో ఉండడంతో వీరిద్దరి స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. రిషబ్ పంత్, కేఎల్ రాహూల్, మహ్మద్ సిరాజ్, శుభ్మన్గిల్ బెర్త్ను ఆశిస్తున్నారు. నాలుగో నంబర్లో రాహూల్ ఆడడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. ‘ఓపెనర్ పృథ్వీషా ప్లేస్లో యువ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ టెస్టు అరంగేట్రం చేస్తాడు. విరాట్ ప్లేస్లో కేఎల్ రాహూల్ జట్టులో ఆడనున్నాడు. హనుమ విహారీ స్థానంలో కంకషన్ నుంచి కోలుకున్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజా జట్టులోకి రానున్నాడు. వికెట్ కీపర్ బ్యాట్స్మన్ వృద్ధిమాన్ సాహా స్థానంలో రిషబ్పంత్, మహ్మద్షమీ స్థానంలో మహ్మద్ సిరాజ్ లేదా నవదీప్ సైనీకి జట్టులో చోటు లభించే అవకాశాలు ఉన్నట్లు’బీసీసీఐ వర్గాలు తెలిపాయి.