నేడు పీయూష్ గోయల్ తో టీ మంత్రుల భేటీ

నేడు పీయూష్ గోయల్ తో టీ మంత్రుల భేటీఢిల్లీ : కేంద్ర, ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని మంత్రుల బృందం సమావేశం కానున్నది. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించనున్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన మంత్రుల బృందం రెండు రోజులుగా నిరీక్షిస్తున్నది.

ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, లోక్ సభ పక్షనేత నామా నాగేశ్వరరావు పార్లమెంట్ లో సోమవారం మంత్రి పీయూష్ గోయల్ ను కలిశారు. పీయూష్ గోయల్ ను కలిసిందుకు మంత్రులు, ఎంపీల బృందం నిరీక్షిస్తున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కలిసేందుకు కేంద్రమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చారని ఎంపీలు తెలిపారు. ఇదిలా ఉండగా ఎంత ధాన్యమైనా కొనుగోలు చేస్తామని కేంద్రం చెబుతున్నా , దీనిపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరనున్నారు.