రేవంత్ రెడ్డి కాన్వాయ్ కి భారీ యాక్సిడెంట్

రేవంత్ రెడ్డి కాన్వాయ్ కి భారీ యాక్సిడెంట్

వరంగల్ టైమ్స్, రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎల్లారెడ్డి పేట మండలం తిమ్మాపూర్ వద్ద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు యాక్సిడెంట్ జరిగింది. కాన్వాయ్ ఓవర్ స్పీడ్ తో రావడంతో 6 కార్లు బలంగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ సమయంలో ఒక్కసారిగా బెలూన్లు ఓపెన్ కావడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 4 కార్లతో పాటు ఇద్దరు రిపోర్టర్ల కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వీ6, టీవీ9, ఎన్టీవీ, ఏబీఎన్, సాక్సి, న్యూస్ నౌ, బిగ్ టీవీ రిపోర్టర్లు ఉన్నట్లు సమాచారం. స్వల్ప గాయాలతో సిరిసిల్ల రిపోర్టర్లు బయటపడ్డట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.