జనవరి 9నుంచి అమ్మఒడి రెండో విడుత

ఈ నెల 16న లబ్ధిదారుల జాబితా ప్రదర్శన
షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్​

జనవరి 9నుంచి అమ్మఒడి రెండో విడుతఅమరావతి : 2020-21 ఏడాదికి గానూ వచ్చే నెల (జనవరి) 9వ తేదీన జగనన్న అమ్మ ఒడిపథకం రెండో విడుత ఆర్థిక సాయం సీఎం వైఎస్ జగన్​ చేత అందజేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రెండో ఫేజ్ చెల్లింపుల్లో భాగంగా షెడ్యూల్ ను మంత్రి ప్రకటించారు. ఇప్పటికే పాఠశాలల్లో అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల పేర్లు నమోదుచేపట్టామన్నారు. ఈ నెల 16న అర్హుల జాబితాను వార్డు, గ్రామ సచివాలయల్లో ప్రదర్శనకు పెడతామన్నారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. చదువుకు పేదరికం అడ్డురాకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్​ ‘జగనన్న అమ్మఒడి’పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ పథకం కింద రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలు, ఎయిడెడ్ అన్ ఎయిడెడ్, ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తింపజేస్తామన్నారు. ఇప్పటికే ఈ పథకం కింద మొదటి విడతగా 43,54,600లపైగా లబ్ధిదారులకు రూ.6.336 కోట్లు అందజేశామన్నారు. 2020-21 ఏడాదికి గానూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా, పారదర్శకంగా…అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందన్నారు. ఇప్పటికే అర్హులైన విద్యార్థులు తల్లిదండ్రులు, సంరక్షకుల పేర్ల నమోదు ప్రక్రియ ఈ నెల 10 తేదీ నుంచి ప్రారంభమైందన్నారు. ఈ నెల 20 వరకూ ఈ నమోదు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పేర్లను నమోదు చేసుకునే సమయంలో ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబరు, రేషన్ కార్డు అందజేయాలని సూచించారు. కులం, ప్రాంతం, వివక్ష లేకుండా ఈ పథకం అమలు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​ వెల్లడించారు.

వరుస సంఖ్య తేదీ కార్యక్రమం

1 10.12.2020 నుంచి 20.12.2020 న అర్హులై విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల పేర్ల నమోదు

2 16.12.2020న అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల జాబితాలను వార్డు సచివాలయాలు, గ్రామ సచివాయల్లో ప్రదర్శన

3 19.12.2020న జాబితాలో తప్పొప్పుల సవరణ అనంతరం అదే రోజు సాయంత్రం 6 గంటలకు అమ్మ ఒడి పోర్టల్ ప్రదర్శన

4 20.12.2020 నుంచి 24.12.2020 వరకు సంబంధిత పాఠశాల, కళాశాల ప్రధానోపాధ్యాయులు,

ప్రిన్సిపాళ్లతో పాటు వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బంది చే సవరించిన జాబితా పరిశీలన

5 26.12.2020 తుది సవరణ అనంతరం జాబితాలను వార్డు, గ్రామ సచివాలయాల్లో ప్రదర్శన.

6 27.12.2020 నుంచి 28.12.2020 తుది సవరణ జాబితాలను గ్రామ, వార్డు సభల్లో ఆమోదం

7 29.12.2020న గ్రామ సభల ద్వారా ఆమోదం పొందిన జాబితాలను ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లచే ఆన్ లైన్లో పొందుపర్చుట

8 30.12.2020 ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు ద్వారా వచ్చిన ఫైనల్ జాబితాలను ఆయా జిల్లా డీఈవోలు.. కలెక్టర్లకు పంపుట

9 30.12.2020 ఫైనల్ జాబితాలను జిల్లా కలెక్టర్ల ఆమోదం తెలుపుట