తెలంగాణలో 3 కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం

తెలంగాణలో 3 కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు నేడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి. విద్యా, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా రావుల శ్రీధర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా మెట్టు శ్రీనివాస్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణలో 3 కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం
మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో రావుల శ్రీధర్ రెడ్డి, మెట్టు శ్రీనివాస్ లు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. తమకు ఈ పదవులు కట్టబెట్టినందుకు సీఎం కేసీఆర్ కు వీరు కృతజ్ఞతలు తెలిపారు.