రైతులది న్యాయ పోరాటమే: బండ ప్రకాష్

రైతులది న్యాయ పోరాటమే: బండ ప్రకాష్వరంగల్ అర్బన్ జిల్లా: ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు రైతుల న్యాయపోరాటానికి మద్దతుగా భారత్ బంద్ లో పాల్గొనాలని రాజ్యసభ సభ్యులు డా. బండ ప్రకాష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న న్యాయమైన పోరాటాన్ని సమర్థిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. బీజేపి ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులు రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో టీఆర్ఎస్ వ్యతిరేకించిందని ‎ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని ఎంపీ బండ ప్రకాష్ చెప్పారు. రైతు పక్షపాతి కేసీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు భారత్ బంద్ లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసి, రైతులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.