దేశంలో గ‌త నాలుగురోజుల్లో 45 వేల‌ పాజిటివ్ కేసులు

దేశంలో గ‌త నాలుగురోజుల్లో 45 వేల‌ పాజిటివ్ కేసులు

న్యూఢిల్లీ: ‌దేశంలో గ‌త నాలుగురోజులుగా క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న 45 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, ఇవాళ 46 వేల‌కు పైగా మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. అయితే కొత్త‌గా వ‌చ్చిన కేసుల కంటే మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్న‌వారి సంఖ్య అధికంగా ఉండ‌టం కొంత ఊర‌ట‌ క‌లిగిస్తున్న‌ది. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 46,232 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 90,50,598కి చేరాయి. ఇందులో 84,78,124 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. మ‌రో 4,39,747 మంది చికిత్స పొందుతున్నారు. ఇక నిన్న‌టి నుంచి ఇప్ప‌టిదాకా 49,715 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. అయితే ఈ మ‌హ‌మ్మారి వ‌ల్ల మ‌రో 564 మంది మృతిచెందారు. దీంతో క‌రోనా మ‌ర‌ణాలు 1,32,726కు పెరిగాయ‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖ ప్ర‌క‌టించింది. దేశంలో మ‌రోమారు క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో భార‌తీయ వైద్య‌ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌) ప‌రీక్ష‌ల‌ను ముమ్మ‌రం చేసింది. ఇందులో భాగంగా నిన్న ఒకేరోజు 10,66,022 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. దీంతో న‌వంబ‌ర్ 20 వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 13,06,57,808 న‌మూనాల‌ను ప‌రీక్షించింది.