వరంగల్ అర్బన్ : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై తొలిసారి బుధవారం వరంగల్కు వచ్చిన బస్వరాజు సారయ్యకు టీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మొదట ఆయన హన్మకొండలోని అమరవీరుల స్తూపానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్,కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కు కృతజ్ఞతలు తెలిపారు. వారు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వరంగల్కు ప్రజలకు అండగా నిలుస్తానన్నారు.