భారత్​ తో మూడో వన్డేకు దూరం కానున్న వార్నర్​

భారత్​ తో మూడో వన్డేకు దూరం కానున్న వార్నర్​సిడ్నీ: భారత్​తో మూడో వన్డేకు ఆస్ట్రేలియా స్టార్​ ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​ దూరం కానున్నట్లు సమాచారం.
ఆదివారం భారత్​తో జరిగిన సెకండ్​ వన్డేలో వార్నర్​ గాయాల బారిన పడ్డాడు. భారత ఇన్నింగ్స్​ నాలుగో ఓవర్లో శిఖర్​ ధావన్​ వేసిన బంతిని ఆపే ప్రయత్నంలో వార్నర్​ నొప్పితో బాధపడ్డాడు. గజ్జల్లో తగిలిన గాయంతో అతను నడవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. చివరకు ఫిజియో, మాక్స్​వెల్​ సాయంతో కుంటుతూనే మైదానం నుంచి బయటకు వెళ్లాడు. మెరుగైన చికిత్స నిమిత్తం అయనను దవాఖానకు తీసుకెళ్లారు. మ్యాచ్​ అనంతరం ఆసీస్​ కెప్టెన్​ అరోన్​ ఫించ్​ మాట్లాడారు. వార్నర్​ ఫిట్​నెస్​ ఎలా ఉందో ఇంకా ఏమీ తెలియదని అతడు తరువాత మ్యాచ్​కు అందుబాటులో ఉంటాడని అనుకోవడంలేదని తెలిపారు. ఓపెనర్​గా జట్టుకు వార్నర్​ మంచి శుభారంభం అందించారని ఫించ్​ తెలిపారు. ఆఖరి మూడో వన్డే బుధవారం కాన్​బెర్రాలో జరగనుంది.