2.3 కోట్ల మందిపై భూకంప ప్రభావం: ప్రెసిడెంట్ 

2.3 కోట్ల మందిపై భూకంప ప్రభావం: ప్రెసిడెంట్

2.3 కోట్ల మందిపై భూకంప ప్రభావం: ప్రెసిడెంట్ 

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ భూకంపం ప్రభావిత పజార్కిక్ పట్టణంతో పాటు హతాయ్ ప్రావిన్స్ లో పర్యటించారు. మొదటి రోజు సహాయక చర్యలకు ఆటంకాలు కల్గాయని, ప్రస్తుతం పరిస్థితి మెరుగైందని తెలిపారు. టర్కీలో 60వేల సిబ్బంది సహాయక చర్యల్లో ఉన్నారు. దాదాపు 2.3 కోట్ల మందిపై భూకంపం ప్రభావం చూపిందని తయ్యిప్ ఎర్డోగాన్ అన్నారు.ఇది తీవ్రమైన సంక్షోభమని డబ్ల్యూహెచ్ఓ కు చెందిన అధికారి ఒకరు పేర్కొన్నారు. భూకంపం వల్ల సర్వస్వం కోల్పోయిన బాధితుల్లో కొంతమంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మరికొంతమంది ఆరుబయటే నిద్రిస్తున్నారు.

టర్కీకి భారత్ వంతుగా సహాయం అందిస్తున్నది. భారత్ నుంచి టర్కీకి వెళ్లిన మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు భూకంప ప్రభావిత ప్రాంతమైన నూర్దగీలో సహాయక చర్యలో చురుకుగా పాల్గొంటున్నారు. ఆర్మీ మెడికల్ బృందాలు క్షతగాత్రులకు వైద్యసాయం అందిస్తున్నాయి.