చైనాలో రెట్టింపైన కరోనా కేసులు

చైనాలో రెట్టింపైన కరోనా కేసులు

వరంగల్ టైమ్స్, షాంఘై : చైనాలో దేశంలో మరోమారు కరోనా విజృంభిస్తుంది. ఒమిక్రాన్ వ్యాప్తితో స్వల్ప వ్యవధిలోనే రోజువారీ కేసులు రెండింతలయ్యాయి. కొత్తగా 2388 కేసులు నమోదయ్యాయని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. గురువారం 1742 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు 1206 కేసులు నమోదయ్యాయి. 2020లో వుహాన్ లో కరోనా కలకలం తర్వాత భారీ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే మొదటి సారి.చైనాలో రెట్టింపైన కరోనా కేసులుకాగా, షాంఘైలో 57 కొత్త కేసులు నమోదయ్యాయని, దేశీయంగా 203 కరోనా లక్షణాలున్న వారిని గుర్తించామని అధికారులు వెల్లడించారు. మార్చి 17 నాటికి చైనా ప్రధాన భూభాగంలో 1,26,234 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 4636 మంది మరణించారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా కరోనా కేసుల సంఖ్యను ప్రకటించలేదు.