ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు 

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా చెప్పుకున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూసిన ఫలితాల్లో చివరకు అనుకున్నదే జరిగింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు పంజాబ్ మినహా మిగిలిన 4 రాష్ట్రాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవా ఎన్నికల కౌంటింగ్ పూర్తవగా, చివరి ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏ రాష్ట్రాల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ఉత్తరప్రదేశ్( 403 ) : బీజేపీ -255, ఎస్పీ – 111, బీఎస్పీ -1 , కాంగ్రెస్ – 2, అప్నాదళ్ – 12, జనసత్తా దళ్ లోక్ తాంత్రిక్ – 2, ఎన్ఐఎస్ హెచ్ఏడీ -6, ఆర్ఎల్డీ -8, ఎస్బీఎస్ -6

ఉత్తరాఖండ్ ( 70 ) : బీజేపీ -47, కాంగ్రెస్ – 19, బీఎస్పీ -02, ఇతరులు -02

మణిపూర్ ( 60 ) : బీజేపీ – 32, కాంగ్రెస్ -05, జనతాదళ్ -06, ఎన్పీపీ -07, ఎన్పీఎఫ్ -05, ఇతరులు – 05

గోవా ( 40 ) : బీజేపీ – 20, కాంగ్రెస్ -11, ఆప్ -02, ఇతరులు -07

పంజాబ్ ( 117 ) : ఆమ్ ఆద్మీ పార్టీ – 92, కాంగ్రెస్ – 18, శిరోమణి అకాలీదళ్ -03, బీజేపీ – 02, బీఎస్పీ -01, ఇతరులు -01