మల్లన్నకు బంగారు కోరమీసం

మల్లన్నకు బంగారు కోరమీసంసిద్ధిపేట జిల్లా : కొమురవెల్లి మల్లికార్జున స్వామిని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. గురువారం మల్లన్న దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన సతీమణి విజయలక్ష్మిలకు దేవస్థాన కార్యనిర్వహణాధికారి, అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మంత్రి దంపతులు ఆలయంలో స్వామిని దర్శించుకుని, అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లన్న స్వామి వారికి 50 గ్రాముల బంగారు మీసాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులకు వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు.