విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదంవిశాఖ జిల్లా : విశాఖ ఉక్కు కర్మాగారం ఎంస్​ఎంఎస్-​ 2 లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్టీల్​ప్లాంట్​ లాడిల్​ తెగిపోవడంతో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఉక్కు ఉద్యోగులతో పాటు పలువురు కాంట్రాక్టర్లకు గాయాలయ్యాయి. 20 టన్నుల ఉక్కు ద్రావణం నేలపాలైంది.గాయాలైనవారిలో నలుగురు ఉద్యోగుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ప్యాక్టరీ యాజమాన్యం హాస్పిటల్​కు తరలించింది. కాగా సుమారు కోటి రూపాయల ఉక్కు ద్రావణం నేలపాలైనట్లు ప్యాక్టరీ యాజమాన్యం తెలిపింది. హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. క్షతగాత్రులు శోభన్​బాబు, ఫైడర్​నాయుడు, శ్రీనివాస్,​ మోహన్​గా అధికారులు గుర్తించారు. కర్మాగారాల్లో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతుండడంతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు