మీ స్టైల్ అదే ఐతే.. నాలో తీవ్రవాదిని చూస్తారు

మీ స్టైల్ అదే ఐతే.. నాలో తీవ్రవాదిని చూస్తారు

మీ స్టైల్ అదే ఐతే.. నాలో తీవ్రవాదిని చూస్తారు

 

వరంగల్ టైమ్స్, మంగళగిరి: ఏపీకి చెందిన నేతలు వేర్పాటువాద ధోరణితో మాట్లాడితే తన లాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలంటూ ఇటీవల కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఈ సందర్భంగా పవన్‌ నిప్పులు చెరిగారు.

రిపబ్లిక్‌ డే రోజున చెప్తున్నా అంటూ ఏపీ నేతలకు హెచ్చరికలు చేశారు. “ఏపీకి చెందిన నేతలు వేర్పాటువాద ధోరణితో మాట్లాడితే నాలాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరని గర్జించారు. విసిగిపోయాం, మీ బతుకులకేం తెలుసు? కాన్‌స్టిట్యూషన్‌ అసెంబ్లీ డిబేట్స్‌ చదివారా? అవినీతిలో మునిగిపోయిన పబ్లిక్‌ పాలసీ తెలియని మీరు రాష్ట్రాన్ని విడగొట్టేస్తారా? మేం చూస్తూ కూర్చొంటామా? మేం దేశ భక్తులం, ఆంధ్రప్రదేశ్‌ను ఇంకోసారి విడగొడతామంటే తోలు తీసి కింద కూర్చోబెడతాం.

తమాషాగా ఉందా? ఎంతమంది సీఎంలు రాయలసీమ నుంచి వచ్చారు? ఆ ప్రాంతానికేం చేశారు? అక్కడ నుంచి వలసలు ఎందుకు ఆపలేకపోయారు? ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలా? వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ కోసం తెలంగాణకు చెందిన జగిత్యాలలో సాయిరెడ్డి చనిపోయారు.. గుంటూరులో హబీబుల్లా మస్తాన్‌ మరణించారు. ఆ సంగతి మీకు తెలుసా? మీ స్వార్థం కోసం ఇష్టారాజ్యంగా స్టేట్‌మెంట్లు ఇవ్వొద్దు. ఇక చాలు రాష్ట్రాన్ని, ప్రజల్ని విడగొట్టింది చాలు.. ఇక ఆపేయండి” అని పవన్‌ తీవ్రంగా వ్యాఖ్యానించారు.