కుప్పకూలిన ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్

కుప్పకూలిన ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్తమిళనాడు : భారత ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. తమిళనాడులోని కూనురు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ తో పాటు కొందరు సిబ్బంది ఆయన కుటుంబ సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది. కోయంబత్తూరు సూలూర్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి వెల్లింగ్టన్ ఆర్మీ బేస్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ లో బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య సహా మొత్తం 9 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

హెలికాప్టర్ కుప్పకూలిన తర్వాత మంటలు చెలరేగాయి. మరోవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించింది. క్షతగాత్రులను ఆదుకునేందుకు కోయంబత్తూరు నుంచి డాక్టర్లు కూనూర్ చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఐఏఎఫ్ ఎంఐ-17వీ5గా గుర్తించారు. ఈ ఘటనపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది.

ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో 9 మంది ఉన్నట్లుగా తెలుస్తుండగా, అందులో నలుగురు మృతిచెందినట్లు నీలగిరి కలెక్టర్ వెల్లడించారు. అయితే ఎవరు మృతిచెందారు అనే పూర్తి సమాచారం మాత్రం తెలియాల్సి ఉంది.