టాప్​టెన్​లో భారత్ ఆటగాళ్లు

టాప్​టెన్​లో భారత్ ఆటగాళ్లుదుబాయ్​ : ఐసీసీ టెస్టు ప్లేయర్​ ర్యాంకింగ్స్​లో భారత బ్యాట్స్​మెన్లకు టాప్​-10లో చోటు లభించింది. భారత కెప్టెన్​ కోహ్లీ టెస్టు మ్యాచ్​ ఆడకపోయినా ద్వితీయ స్థానానికి దూసుకువచ్చాడు. న్యూజిలాండ్​ సారథి కేన్​ విలియమ్సన్​ ఒక ర్యాంకు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. టెస్టు స్పెషలిస్ట్​ పుజారా ఏడో ర్యాంకును నిలబెట్టుకోగా ఆజింక్య రహానె పదో ర్యాంకు దక్కించుకున్నాడు. అలాగే ఆస్ట్రేలియా స్టార్​ ప్లేయర్​ స్టీవ్​ స్మిత్​ 911 రేటింగ్​ పాయింట్లతో బ్యాట్స్​మెన్​ ర్యాంకింగ్స్​లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్​లో భారత సీనియర్​ స్పిన్నర్​ ఆశ్విన్​ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని పదో స్థానంలో నిలిచాడు. ఆసీస్​ స్పీడ్​స్టార్​ పాట్​ కమిన్స్​ నంబర్​వన్​ బౌలర్​గా కొనసాగుతున్నాడు.