సిడ్నీ : టీమీండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ డిసెంబర్ 17 నుంచి ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఇరుజట్ల ప్లేయర్స్ మొదటి టెస్టు (డై అండ్ నైట్) కోసం సిద్ధమవుతున్నారు. భారత్తో సన్నాహాక మ్యాచ్లో నలుగురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు కంకషన్కు గురైన విషయం విదితమే. అయితే మంగళవారం ఆసీస్ జట్టు సాధన చేసింది. ప్రాక్టీస్ ప్రారంభమైన పది నిమిషాలకే స్మిత్ డ్రెస్సింగ్ గదికి తిరిగి వెళ్లిపోయాడు. మళ్లీ బ్యాటింగ్ సాధన చేసేందుకు నెట్స్కు రాలేదు. బుధవారం స్మిత్ శిక్షణకు దూరంగా ఉంటాడని క్రికెట్ ఆసీస్ ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు. బంతిని అందుకునే క్రమంలో అతడు గాయపడ్డాడని తెలిపారు. స్మిత్ వెన్నునొప్పికి చికిత్స తీసుకుంటున్నాడని ప్రతినిధి వెల్లడించారు. డేవిడ్ వార్నర్, పుకోస్కీ ఇదివరకే గాయాలపాలైన విషయం విదితమే.