ప్రధాని మోడీకి ఆహ్వానం

ప్రధాని మోడీకి ఆహ్వానంప్రధాని మోడీకి ఆహ్వానం

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ: శ్రీరామచంద్రుడి జన్మభూమి అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శుభ ముహూర్తం ఖరారైంది.ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొననున్నారు.శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు చంపత్ రాయ్,నృపేంద్ర మిశ్రా,మరో ఇద్దరు ప్రధాని మోదీని కలిసి ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు.ట్రస్ట్ సభ్యుల అభ్యర్థన మేరకు ప్రధాని మోడీ ఆహ్వానాన్ని అంగీకరించారు. వెయ్యేళ్లు అయినా సరే చెక్కు చెదరని, ప్రపంచంలోనే అత్యద్భుతమైన రామమందిర నిర్మాణం జరుగుతోంది.

భక్తుల ఆశలకు,ఆకాంక్షలకు అనుగుణంగా రామమందిర నిర్మాణం పూర్తి అయ్యింది.ఈక్రమంలోనే అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది.రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్నిఅంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్ధ్ క్షేత్ర ట్రస్టు ప్రకటించింది. 2024 జనవరి 22న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగనుంది.ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12:30 గంటలకు నిర్వహించబడుతుంది.