ముగిసిన లక్నో బ్యాటింగ్..పంజాబ్ టార్గెట్ 154 

ముగిసిన లక్నో బ్యాటింగ్..పంజాబ్ టార్గెట్ 154

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఐపీఎల్ 2022లో శుక్రవారం మరో ఉత్కంఠ భరిత పోరుకు రంగం సిద్ధమైంది. ఎంసీఏ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో పంజాబ్ కింగ్స్ పోటీపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 13 పరుగుల వద్దే మొదటి వికెట్ కోల్పోయింది.ముగిసిన లక్నో బ్యాటింగ్..పంజాబ్ టార్గెట్ 154 6 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ రబాడ బౌలింగ్ లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. డికాక్ 46 పరుగులతో టాప్ స్కోరర్ అయ్యాడు. దీపక్ హుడా 34 రన్స్ చేశాడు. చివరిలో దుశ్మంత చమీర రెండు సిక్సర్లతో 17 పరుగులు చేసి ఔటయ్యాడు.

పంజాబ్ కింగ్స్ బౌలర్లలో రబాడ 4, రాహుల్ చహర్ 2, సందీప్ శర్మ 1 వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఐతే 154 స్వల్ప స్కోరులాగే కనిపించినా, పంజాబ్ టార్గెట్ చేరుకోవాలంటే 154 చేయాలి. మొదటి నుంచి అన్ని మ్యాచుల్లో పటిష్ట ఆటను కనబరుస్తున్న లక్నో, పంజాబ్ జట్లలో ఏ జట్టు విజయం సాధిస్తుందోనని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.