అమిత్ షాతో కేసీఆర్ భేటీ

అమిత్ షాతో కేసీఆర్ భేటీహైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయిన కేసీఆర్ తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆయన నివాసంలోనే సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులు, రాజకీయ అంశాలపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్ వరదలు, అకాల వర్షాల సమయంలో విపత్తు నిర్వహణ కింద రావాల్సిన నిధులు, కేంద్ర హోంశాఖ నుంచి పోలీసు వ్యవస్థ ఆధునీకరణకు , వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధుల అంశాలపై కేసీఆర్ కీలకంగా ప్రస్తావించినట్లు సమాచారం. హైదరాబాద్ లో వరదలకు పాడైన రోడ్ల అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనా అమిత్ షాతో సీఎం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్న కేసీఆర్ ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పురి, నరేంద్రసింగ్ తోమర్ లతో ఆయన సమావేశంకానున్నట్లు సమాచారం. ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం కోసం కేంద్రం కేటాయించిన స్థలాన్ని కూడా కేసీఆర్ పరిశీలించి శంకుస్థాపనపై నిర్ణయం తీసుకోనున్నారు.అమిత్ షాతో కేసీఆర్ భేటీ