భారీ ఎన్ కౌంటర్ , మావోయిస్టులు మృతి

భారీ ఎన్ కౌంటర్ , మావోయిస్టులు మృతిగడ్చిరోలి : మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో జవాన్లు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎన్ కౌంటర్ జరిగిన విషయాన్ని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ ధ్రువీకరించారు.

మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో నలుగురు జవాన్లు గాయపడినట్లు వెల్లడించారు. గాయపడిన జవాన్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

శనివారం ఉదయ గ్యారపట్టి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తోన్న పోలీసు బలగాలకు, మావోయిస్టులు తారసపడ్డారు. ఈక్రమంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి.

ఉదయం నుంచి ఈ కాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం 26 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. ఈ కాల్పులతో సరిహద్దు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఘటనాస్థలిలో కూంబింగ్ కొనసాగుతోంది.