జాతీయ హ్యాండ్ బాల్ టోర్నీకి వేదికగా హైదరాబాద్

జాతీయ హ్యాండ్ బాల్ టోర్నీకి వేదికగా హైదరాబాద్స్పోర్ట్స్ డెస్క్ : జాతీయ మహిళల సీనియర్ హ్యాండ్ బాల్ టోర్నీకి హైదరాబాద్ వేదిక కాబోతుంది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 3 వరకు జరుగనున్న ఈ టోర్నీలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన 30 జట్లు పోటీపడనున్నాయి. టోర్నీలో పాల్గొనే జట్లు జాతీయ సంఘానికి లేదా ఆతిథ్య తెలంగాణ అసోసియేషన్ కు సమాచారమందించాలని భారత హ్యాండ్ బాల్ అసోసియేషన్ (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్ మోహన్ రావు శనివారం వెల్లడించారు.

సరూర్ నగర్ స్టేడియం, అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ లో మ్యాచ్ లు జరుగనున్నాయని ఆయన తెలిపారు. భారత క్రీడా ప్రాధికార సంస్థ ( సాయ్ ) మార్గదర్శకాలను అనుసరించి కొవిడ్ -19 నిబంధనలకు అనుగుణంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. టోర్నీలో పాల్గొనే ప్లేయర్లు, కోచ్ లు, సహాయక సిబ్బందికి వసతి సౌకర్యాలు కల్పిస్తామని మీడియాకు జగన్ వివరించారు.