ఆ ఇద్దరి వల్లే పేపర్ లీకేజీ : మంత్రి కేటీఆర్

ఆ ఇద్దరి వల్లే పేపర్ లీకేజీ : మంత్రి కేటీఆర్

warangaltimes, హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ పటిష్టంగానే ఉందని, కేవలం ఇద్దరుు వ్యక్తుల వల్లే పేపర్ లీకేజీ జరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. సచివాలయం బీఆర్కే భవన్ లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.ఆ ఇద్దరి వల్లే పేపర్ లీకేజీ : మంత్రి కేటీఆర్

* దీనివెనకాల ఇంకెవ్వరున్నా కఠిన శిక్షలే
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజీ వెనక ఇద్దరు వ్యక్తులు ఉన్నారని, వాళ్లిద్దరు చేసిన తప్పు అని, ఇది వ్యవస్థ చేసిన తప్పు కాదని వివరించారు. వీళ్లిద్దరే కాకుండా లీకేజీ కేసులో ఇంకెవరు ఉన్నా అందరినీ కఠినంగా శిక్షిస్తామన్నారు.

* సమర్థవంతంగా టీఎస్పీఎస్సీ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 155 నోటిఫికేషన్లు విడుదల అయ్యాయని 37 వేల ఉద్యోగాలను టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేయటం జరిగిందన్నారు. టీఎస్ పీఎస్సీ ద్వారా ఒకే సారి 10 లక్షల మందికి పరీక్ష నిర్వహించి భారతదేశంలోనే అత్యుత్తమ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లలో ఒకటిగా గుర్తింపు టీఎస్ పీఎస్సీ గుర్తింపు పొందిందని కాలాగుణంగా సాంకేతికంగా ముందుకు వెళుతుందన్నారు. అందులో భాగంగానే (ఓటీఆర్)వన్ టైం రిజిస్ట్రేషన్ తీసుకు రావటం జరిగిందన్నారు. డిజిటల్ చెల్లింపులు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించిన ఘనత కూడా టీఎస్ పీఎస్సీదే అని కేటీఆర్ మీడియాకు వివరించారు.

* టీఎస్పీఎస్సీని స్ఫూర్తిగా తీసుకున్న 13 రాష్ట్రాలు
ఇప్పటివరకు 99 పరీక్షలను నిర్వహించటం ద్వారా నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని వివరించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు రెండు సార్లు తెలంగాణకు వచ్చి టీఎస్ పీఎస్సీపై అధ్యయనం చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. దేశంలోని 13 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు వచ్చి పరిశీలించి, అధ్యయనం చేసి ఆయా రాష్ట్రాల్లో అమలు చేశారని వెల్లడించారు.

దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను భర్తీ చేసిన సర్వీస్ కమిషన్ గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుర్తింపు. 28 రాష్ట్రాల్లో ఎక్కడా జరగని విధంగా ఏడు భాషల్లో ఒకేసారి పరీక్షలు నిర్వహించిన ఘనత కూడా టీఎస్ పీఎస్సీదే అని కేటీఆర్ మరోసారి తెలిపారు.