శ్రీనివాస్ గౌడ్ పై మర్డర్ ప్లాన్..8మంది అరెస్ట్

శ్రీనివాస్ గౌడ్ పై మర్డర్ ప్లాన్..8మంది అరెస్ట్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగిందని, ఈ ఘటనలో 8 మందిని అరెస్ట్ చేశామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. బుధవారం రాత్రి హత్య కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ఫిబ్రవరి 23న ఫరూక్, హైదర్ అలీ సుచిత్ర వద్ద ఒక లాడ్జిలో ఉన్నారు. 25న ఈ ఇద్దరు టీ తాగేందుకు బయటకు వెళ్లినప్పుడు యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్ అనే ముగ్గురు మహబూబ్ నగర్ నుంచి వచ్చి కొంపల్లి ఏరియాలో సుచిత్రలో కత్తులతో వెంబడించి చంపడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత ఫరూక్ , హైదర్ అలీ తప్పించుకున్నారు. 5 గంటల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేట్ బషీర్ బాద్ పోలీసులు సెక్షన్ 307, 120బీ, 115 రెడ్ విత 34 ఐపీసీ, సెక్షన్ 25 ఏబీ ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ చేసినట్లు తెలిపారు.శ్రీనివాస్ గౌడ్ పై మర్డర్ ప్లాన్..8మంది అరెస్ట్ఇద్దరు తప్పించుకున్న తర్వాత ముగ్గురు అదే ప్రాంతంలో కొన్ని లాడ్జీల్లో వెతికారు. వీరిని 26న అరెస్ట్ చేశామని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. 27న జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాం. నాగరాజు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కొన్ని విషయాలు తెలిపినట్లు వెల్లడించారు. రాఘవేంద్ర రాజు, కొందరితో కలిసి హత్యకు కుట్రపన్నారని చెప్పారు. ఆ తర్వాత విచారణ జరుపగా రాఘవేందర్ రాజు, మున్నూరు రవి, మధుసూదన్ రాజు ఢిల్లీలో ఉన్నట్లు తెలిసింది. అయితే, వీరి గురించి సమాచారం లేదని, వారి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సర్వెంట్ క్వార్టర్ లో ఉన్నట్లు తెలవడంతో ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకువచ్చినట్లు సీపీ చెప్పారు. దీంతో ఈ హత్య కేసు వెలుగులోకి వచ్చినట్లు వెల్లడించారు.

రాఘవేందర్ రాజు, మధుసూదన్, అమరేందర్, రవి కలిసి మహబూబ్ నగర్ నుంచి వైజాగ్ వెళ్లి, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లి షెల్టర్ తీసుకున్నారు. వీరికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్, పీఏ రాజు అని విచారణలో తేలింది. వీళ్లందరిని సర్వెంట్ క్వార్టర్స్ లో నోటీసులు ఇచ్చి, అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తీసుకువచ్చాం. వారిని ప్రశ్నించగా, కుట్ర కేసు వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా పలు ఆయుధాలను రికవరీ చేశామన్నారు. రాఘవేందర్ రాజు నుంచి రెండు రౌండ్ల 9 ఎంఎం, పిస్టల్, దుండిగల్ ఫారెస్ట్ ఏరియాలో 6 రౌండ్స్ రివాల్వర్ రాజు నుంచి రికవరీ చేసి, ఆ తర్వాత నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

విచారణలో భాగంగా రాఘవేంద్ర రాజును ప్రశ్నించిన పోలీసులకు మరింత సమాచారం దొరికింది. రాష్ట్ర కేబినెట్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు వీరంతా కుట్ర పన్నినట్లు తేలింది. కేసు వివరాల్లోకి వెళ్లితే, రాఘవేందర్ రాజు మొదట ఫరూక్ ను కలిసాడు. ఫరూక్ కి కూడా నేర చరిత్ర ఉన్నది. మంత్రిని హత్య చేయాలని, నువ్వు చేసినా సరే, వేరే వారితోనైనా సరే హత్య చేయించాలని ప్రణాళిక వేశారు. హత్య కోసం రూ. 15 కోట్ల వరకు సుఫారీ ఇవ్వచూపారు. హత్య కేసులో 8 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కుట్రలో రాఘవేంద్ర రాజు, మున్నూరు రవి, అమరేందర్ రాజు, మధుసూదన్, షెల్టర్ ఇచ్చిన వ్యక్తితో మరో ముగ్గురు భాగస్వాములైనట్లు విచారణలో తెలిసింది. హత్య కేసుకు ప్రధాన సూత్రధారులు అమరేందర్ రాజు, మధుసూదన్ అని వివరించారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. పోలీసు కస్టడీలోకి నిందితులను తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని సీపీ వివరించారు.శ్రీనివాస్ గౌడ్ పై మర్డర్ ప్లాన్..8మంది అరెస్ట్ఈ హత్య కుట్ర కేసులో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పాత్రపై విచారణ జరుపుతున్నట్లు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సీపీ బదులిచ్చారు. జితేందర్ రెడ్డి.. పీఏ రాజు, డ్రైవర్ థాప, సౌత్ అవెన్యూలోనే షెల్టర్ ఇచ్చినట్లు తెలిసింది. ఘటనలపై లోతైన విచారణ జరిపి హత్య వెనుక ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరెవరున్నారనే విషయాలను వెలుగులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఆయుధాలను రాజు యూపీ నుంచి కొనుగోలు చేసినట్లు తెలిసిందని, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదై, నాగరాజు అరెస్టైన తర్వాత హత్య కేసు, నిందితుల వివరాలు వెలుగులోకి వచ్చాయని సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరించారు.