మంత్రి ఎర్రబెల్లిని ఆశీర్వదించిన ఒగ్గు కళాకారులు

మంత్రి ఎర్రబెల్లిని ఆశీర్వదించిన ఒగ్గు కళాకారులుహైదరాబాద్ : ఇటీవలే కరోనా బారినపడి కోలుకున్న రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఒగ్గు కళాకారులు హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి త్వరగా కోలుకోవాలని పూజలు చేశారు. అనంతరం ఎల్లమ్మ, మల్లన్నల పసుపు, కుంకుమ, ప్రసాదాలను మంత్రికి అందచేశారు. ఒగ్గు పూజారులు తమ సంప్రదాయ పద్ధతిలో ఢమరుకం ( ఒగ్గు) మోగిస్తూ మంత్రిని ఆశీర్వరించారు. ఈ కార్యక్రమంలో ఒగ్గు రవి నేతృత్వంలోని ఒగ్గు కళాకారుల బృందం పాల్గొంది. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వీరికి కృతజ్ఞతలు తెలిపారు.మంత్రి ఎర్రబెల్లిని ఆశీర్వదించిన ఒగ్గు కళాకారులు