అత్యాచారం కేసులో దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష

అత్యాచారం కేసులో దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష

వరంగల్ టైమ్స్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా : నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్షపడే విధంగా న్యాయస్థానం తీర్పునిచ్చింది. జిల్లాలోని అడవి ముత్తారం మండల పరిధికి చెందిన నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో భూపాలపల్లి మండలం నాగారం గ్రామానికి చెందిన రాస కొమురయ్యకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు, రూ. 1000 జరిమానా విధిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా సెషన్స్ జడ్జి నారాయణ బాబు శుక్రవారం తీర్పు వెలువడించారు.

అత్యాచారం కేసులో దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష

కేసు పూర్వపరాల ప్రకారం.. నేరస్థుడు రాస కొమురయ్య (తండ్రి మల్లయ్య), వయస్సు-36, కులం-కురుమ, గ్రామం-నాగారం, భూపాలపల్లి మండల వాసి. 2019 డిసెంబర్ 31 రాత్రి అడవి ముత్తారం మండల పరిధిలోని ఓ గ్రామంలో గల ఓ ఇంట్లోకి రాత్రిపూట అక్రమంగా చొరబడి అక్కడ నిద్రిస్తున్న నాలుగేళ్ల చిన్నారిని గ్రామ శివారులోకి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు అడవి ముత్తారం పోలీసులు కేసు నమోదు చేశారు.

అప్పటి కాటారం డీఎస్పీ బోనాల కిషన్ అత్యాచార ఘటనపై విచారణ చేపట్టి చార్జిషీట్ ఫైల్ చేశారు. గత కొంతకాలంగా రేప్ కేసులో కొమురయ్యను కోర్టు విచారిస్తూనే ఉంది. ఈ విచారణలో వాదోపవాదనలు విన్న తర్వాత రాస కొమురయ్యను దోషిగా నిర్ధారించింది. దీంతో రాస కొమురయ్యకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. వెయ్యి జరిమానా విధిస్తూ జడ్జి నారాయణ బాబు తీర్పు వెలువడించారు.

ఈ కేసులో నిందితుడికి శిక్ష పడే విధంగా సమర్థవంతంగా వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోగికార్ శివరాజును, సమగ్ర దర్యాప్తు చేపట్టిన అప్పటి కాటారం డీఎస్పీ బోనాల కిషన్ ను, కోర్టు ట్రయల్ ను నడిపించిన కాటారం సీఐ రంజిత్ రావును, అడవి ముత్తారం ఎస్సై రమేష్ ను, సాక్షులను ప్రవేశపెట్టిన ఏఎస్ఐ వెంకన్న, హెడ్ కానిస్టేబుల్ భూమయ్యలను జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి అభినందించారు.