మరోమారు దాతృత్వాన్ని చాటిన మాస్టర్​ బ్లాస్టర్​

మరోమారు దాతృత్వాన్ని చాటిన మాస్టర్​ బ్లాస్టర్​ముంబై : మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​, బారత మాజీ క్రికెట్​ దిగ్గజం మారోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. క్లిష్టమైన వ్యాధులతో బాధపడుతున్న పిల్లల వైద్యానికి అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకొచ్చాడు. ఏకమ్‌ ఫౌండేషన్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, అసోం, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల్లో వంద మంది పిల్లలకు సచిన్​ సాయం అందించనున్నాడు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ట్రస్ట్‌ దవాఖానల్లో చికిత్స అయ్యే ఖర్చు తన ఫౌండేషన్‌ ద్వారా సమకూర్చబోతున్నాడు. ప్రస్తుతం యునిసెఫ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న భారత మాజీ కెప్టెన్‌..వైద్య సహాయం విషయంలో పెద్ద మనసు చాటుకుని ఔదార్యం చూపారు.