ఏడుగురు న్యాయవాదులకు జడ్జిలుగా పదోన్నతి

అమరావతి : ఏడుగురు లాయర్లకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది. న్యాయవాదులు కొనగంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, రాజశేఖర్ రావు, సత్తి సుబ్బారెడ్డి, రవి చీములపాటి, వి.సుజాతలకు పదోన్నతి కల్సిస్తూ వారి పేర్లను కొలీజియం సభ్యులు సుప్రీంకోర్టుకు సిఫార్సు చేశారు.