ఐపీఎల్ నుంచి తప్పుకున్న స్టార్ క్రికెటర్

ఐపీఎల్ నుంచి తప్పుకున్న స్టార్ క్రికెటర్దుబాయ్ : స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ , ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. పంజాబ్ కింగ్స్ లెవన్ తరపున ఆడుతున్న అతను టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొన్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన బయో బబుల్ వాతావరణ ఆంక్షలను తట్టుకోలేక టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు.

తాజాగా దుబాయ్ లో జరుగుతున్న ఎడిషన్ లో అతను రెండ్ మ్యాచ్ లు ఆడాడు. అయితే నవంబర్ లో ప్రారంభం కానున్న టీ 20 వరల్డ్ కప్ నేపథ్యంలో గేల్ మానసిక ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నాడు. ఇటీవల సీపీఎల్ లో ఆడిన గేల్ అక్కడ కూడా బయో బబుల్ వాతావరణంలోనే ఉన్నాడు.

కరోనా నేపథ్యంలో ఆటగాళ్ల సంరక్షణ కోసం బయో బబుల్ ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని మాసాల నుంచి సీడబ్ల్యూఐ బబుల్ లో ఉన్నానని, ఆ తర్వాత ఐపీఎల్ బబుల్ లోకి వచ్చానని గేల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో మానసికంగా బలోపేతం కావాలనుకుంటున్నానని పేర్కొన్నారు. దుబాయ్ లోనే బ్రేక్ తీసుకుంటానని, వరల్డ్ కప్ టోర్నీలో విండీస్ కు హెల్ప్ చేయాలనుకుంటున్నట్లు గేల్ తెలిపాడు.