2 వికెట్లు కోల్పోయిన టీంఇండియా

2 వికెట్లు కోల్పోయిన టీంఇండియాకేప్ టౌన్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న 3వ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఔటయ్యారు. మొదట టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకున్నది. నిజానికి మంచి స్టార్ట్ ఇచ్చిన ఓపెనర్లు, భారీ స్కోర్లు చేయకుండానే వెనుదిరిగారు. కేఎల్ రాహుల్ 12, మయాంక్ అగర్వాల్ 15 రన్స్ చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజ్ లో కెప్టెన్ కోహ్లీ, పుజారాలు ఉన్నారు. ఇండియా 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది.