క్యాంప్ ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తాం

క్యాంప్ ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తాం
హైదరాబాద్ : తెలంగాణలో గోహత్యలు జరుగుతున్నా సీఎం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. హైదరాబాద్ కేంద్రంగా ఓల్డ్ సిటీలో అక్రమంగా గోవధ శాలలు నడుస్తున్నా అధికార ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని రాజాసింగ్ మండిపడ్డారు. కట్టర్ హిందు అని చెప్పుకునే సీఎం రాజ్యంలో గోహత్యలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. గో హత్యలను ప్రభుత్వం అడ్డుకోకపోతే భజరంగ్‌దళ్, హిందువులు కలిసి అడ్డుకుంటారని అన్నారు. గోవుల తరలింపుపై ప్రభుత్వం స్పందించకుంటే సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదుట గోవులను తీసుకెళ్లి ధర్నా చేస్తామని రాజాసింగ్ హెచ్చరించారు. కాగా, ఖమ్మం నుంచి 33 ఆవు దూడలను అక్రమంగా హైదరాబాద్‌కు తరలిస్తుండగా ఎమ్మెల్యే రాజసింగ్ చౌటుప్పల్ వద్ద పట్టుకున్నారు. నిందితులను స్థానిక పోలీసులకు అప్పగించారు. చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆవు దూడలను జియగూడాలోని గోశాలకు తరలించారు.