అమరావతి : ఐసీజేఎస్( ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్) అమలు చేయడం, వినియోగంలో ఏపీ పోలీస్శాఖ మరోసారి సత్తా చాటింది. జాతీయస్థాయిలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. కాగా మహారాష్ట్ర మొదటిస్థానం, తెలంగాణ మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. ఇందుకు సంబంధించిన అవార్డును మంగళవారం డీజీపీ గౌతమ్సవాంగ్ కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి చేతులమీదుగా ఆన్లైన్ ద్వారా అందుకున్నారు. ప్రతిష్టాత్మకమైన అవార్డు ను పోలీస్ శాఖ దక్కించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన సీఎం వైఎస్ జగన్ హోం మంత్రి మేకతోటి సుచరిత పోలీస్శాఖను అభినందించారు.