లోక్ సభ మార్చి 9 వరకు వాయిదా
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ: లోక్ సభ మార్చి 9వ తేదీ వరకు వాయిదా పడింది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం, కార్మిక చట్టాలపై విపక్షాల నిరసనలతో సభ దద్దరిల్లింది. అలాగే, జెఫ్రీ ఎప్టోన్తో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సంబంధాలపై వివరణ కోరుతూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. మరోవైపు, రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే నోటీసు ఇవ్వడం గందరగోళానికి దారితీసింది. దీంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.














