సిడ్నీ: భారత్ ,ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్కు ఆతిథ్యం వహిస్తున్న సిడ్నీ మైదానం ఓ జంటను ఏకం చేసిన వేదికగా మారింది. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో భారత్ బ్యాట్స్మెన్ కోహ్లీ , శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక భారత యువకుడు ఆస్ట్రేలియా యువతికి తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఆమె ఎదుట మోకాళ్లపై ఉండి ఉంగరం చూపిస్తూ తనను పెళ్లి చేసుకుంటావా ..అని అడిగాడు. ఈపరిణామానికి ఆశ్చర్యపోయిన యువతి యువకుడి ప్రేమకు గ్రీన్సిగ్నల్ ఇచ్చి పచ్చజెండా ఊపింది. అయితే ఇదంతా కెమెరాకు చిక్కి స్టేడియంలో ఉన్న పెద్ద స్క్రీన్లపై ప్రత్యక్ష ప్రసారమైంది. ఇది గమనించిన ప్రేక్షకులు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. ఇదిలా ఉండగా మైదానంలో ఫిల్లింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాక్స్వెల్ సైతం ఆ యువ జంటను చూసి తను సైతం చప్పట్లు కొడుతూ అభినందించాడు. మరో ఆసక్తికర విషయం ఏంటనగా మ్యాక్స్ వెల్ భార్య కూడా భారతీయ యువతి కావడం గమనార్హం. ప్రస్తుతం ఆ జంటకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్అవుతుంది. ఎక్కడ చూసినా ఈవార్త హాట్టాఫిక్ గా మారింది.