రెండో సారి ఉపరాష్ట్రపతికి కరోనా

రెండో సారి ఉపరాష్ట్రపతికి కరోనాహైదరాబాద్ : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు కరోనా రావడం రెండో సారి. ప్రస్తుతం ఆయన వెంకయ్యనాయుడు హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీకి వెళ్లే ముందు ఆయన కొవిడ్ పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తేలింది. తనకు ఇటీవల కాంటాక్ట్ లో వచ్చిన వారందరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని ఉపరాష్ట్రపతి సూచించారు. పరీక్షలు నిర్వహించుకోవాలని వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు.