ఖగోళంలో మరో అద్భుతాన్ని వీక్షించే అవకాశం

ఖగోళంలో మరో అద్భుతాన్ని వీక్షించే అవకాశం

ఖగోళంలో మరో అద్భుతాన్ని వీక్షించే అవకాశంవరంగల్ టైమ్స్, హైదరాబాద్ : బుధవారం రాత్రి 9 గంటల తర్వాత ఆకాశంలో కాంతులు వెదజల్లుతూ జెమినిడ్స్‌ ఉల్కాపాతం జరగబోతున్నట్లు ప్లానెటరీ సొసైటీ, ఇండియా వ్యవస్థాపక కార్యదర్శి, డైరెక్టర్‌ ఎస్‌. రఘునందన్‌ రావు తెలిపారు. దీన్ని మామూలు కంటితోనే చూసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇసుక రేణువంత ఉండే ఈ ధూళి రేణువులు భూ వాతావరణాన్ని తాకి కాంతిజ్వాలగా కాలిపోతాయన్నారు. ఇలా డిసెంబరు 17 వరకు కనిపిస్తాయన్నారు. పౌర్ణమి తర్వాత ఏర్పడుతుండటంతో గంటకు 150 కిపైగా మెరుపులు వస్తాయని అన్నారు. మనం 30-40 మాత్రమే చూడగలుగుతామని ఆయన చెప్పారు.