వరంగల్ లో రికార్డు ధర పలికిన మిర్చి

వరంగల్ లో రికార్డు ధర పలికిన మిర్చి

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో దేశీ రకం మిర్చికి రికార్డు స్థాయిలో క్వింటాల్ కు రూ.32 వేలు ధర పలికింది. దేశీరకం మిర్చికి ఇక్కడ ఇంత రేటు పలకటం మార్కెట్ చరిత్రలో ఇదే మొదటి సారి కావడం విశేషం. దీంతో మిర్చి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ లో రికార్డు ధర పలికిన మిర్చిక్వింటాల్ ధర రూ. 32 వేలు పొందిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కపల్లి గ్రామానికి చెందిన రైతు భిక్షపతిని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి సన్మానించారు. మార్కెట్ అధికారులు బీవీ రాహుల్, చందర్ రావు, భాస్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.