రెండ్రోజుల పాటు వరంగల్ లో సీజేఐ పర్యటన

రెండ్రోజుల పాటు వరంగల్ లో సీజేఐ పర్యటనహైదరాబాద్ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రెండు రోజుల పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. నేడు ములుగు జిల్లాలోని రామప్ప గుడితో పాటు, రామప్ప చెరువును జస్టిస్ రమణ దంపతులు సందర్శించనున్నారు. శనివారం రాత్రికి హనుమకొండలోని ఎన్ ఐటీ అతిథి గృహంలో బస చేస్తారు. రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విందుకు హాజరవుతారు.

ఆదివారం ఉదయం భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకుంటారు. ఆదివారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య హనుమకొండలోని కోర్టుల సముదాయాన్ని ప్రారంభిస్తారు. రూ.22 కోట్ల వ్యయంతో పది కోర్టుల భవనం నిర్మించారు. అదే రోజు సాయంత్రం షామీర్ పేటలోని నల్సార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. సోమవారం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.