అజ్మీర్ దర్గాలో చాదర్ సమర్పించిన కేసీఆర్

అజ్మీర్ దర్గాలో చాదర్ సమర్పించిన కేసీఆర్

అజ్మీర్ దర్గాలో చాదర్ సమర్పించిన కేసీఆర్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా ప్రతీ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్పించే ‘చాదర్’ ను సీఎం కేసీఆర్ ఈ ఏడాది కూడా సమర్పించారు. బుధవారం ప్రగతి భవన్ లో ముస్లిం మతపెద్దల సమక్షంలో దైవ ప్రార్థనలు జరిపిన అనంతరం చాదర్ ను అజ్మీర్ దర్గాలో సమర్పించేందుకు సీఎం కేసీఆర్ వక్ఫ్ బోర్డు అధికారులకు అందచేశారు.

ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూధనాచారి, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, ఎమ్మెల్యేలు మహమ్మద్ షకీల్, గ్యాదరి కిశోర్ కుమార్, సుధీర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య తదితరులతో పాటు…
వక్ప్ బోర్డు చైర్మన్ మసీఉల్లాఖాన్, హజ్ కమిటీ చైర్మన్ మహమ్మద్ సలీం, ఉర్దూ అకాడెమీ చైర్మన్ ఖాజా మొజీబుద్దీన్, ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, ఆర్టీఐ కమిషనర్ మహమ్మద్ అమీర్, టీ న్యూస్ ఉర్దూ ఎడిటర్ సీనియర్ జర్నలిస్టు ఖాజా ఖయ్యూం అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

ఖాదీ బోర్డ్ చైర్మన్, మౌలానా యూసిఫ్ జాహిద్, ముఫ్తీ- మస్తాన్ వలి, హాఫెజ్ సాబెర్ పాషా ఈ సందర్భంగా ప్రార్థనలు జరిపారు. తెలంగాణ ప్రజలను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని చల్లగా చూడాలని, రాష్ట్రం మరింత ప్రగతి పథంలో సాగాలని, దేశ ప్రజలందరూ ఐకమత్యంతో జీవించేలా దీవించాలని అల్లాను ఈ సందర్భంగా వారు ప్రార్థించారు.