రాష్ట్రం నుంచి ఇద్దరికి రాష్ట్రపతి మెడల్

రాష్ట్రం నుంచి ఇద్దరికి రాష్ట్రపతి మెడల్

రాష్ట్రం నుంచి ఇద్దరికి రాష్ట్రపతి మెడల్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా 901 మంది పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ పతకాలు ప్రకటించింది. 140 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (పీఎంజీ), 93 మందికి విశిష్ట సేవకు రాష్ట్రపతి పోలీస్ మెడల్ (పీపీఎం) తో పాటు 668 మందికి పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ (పీఎం) పతకాలకు ఎంపికయ్యారని కేంద్ర హోంమంత్రిత్వశాఖ బుధవారం తెల్పింది.

తెలంగాణ నుంచి 13 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ పతకం, ఇద్దరికి రాష్ట్రపతి పోలీస్ పతకాలకు ఎంపికయ్యారు. ఇందులో ఇంటిలిజెన్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ అనిల్ కుమార్, 12వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ రామకృష్ణ రాష్ట్రపతి మెడల్ కు ఎంపికయ్యారు.