ఆయుష్ మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం 

ఆయుష్ మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : యూజీ ఆయూష్ సీట్ల ఖాళీల భర్తీకి కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. యూజీ ‘నీట్’ ఆయూష్ కటాఫ్ స్కోర్ ను 5% తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు క్వాలిఫయింగ్ కటాఫ్ జనరల్ కేటగిరీ 45వ పర్సెంటైల్, దివ్యాంగులు ( జనరల్ )కు 40, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వుడ్ కేటగిరీలకు 35 పర్సెంటైల్ గా నిర్ణయించారు. కటాఫ్ మార్కులు తగ్గడంతో ఇందుకు అనుగుణంగా అర్హులైన అభ్యర్థులు బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్, బీఎన్ వైఎస్, బీయూఎంఎస్ కన్వీనర్ కోటా అలాగే బీహెచ్ఎంఎస్ యాజమాన్య కోటాలలో దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ మరోసారి ప్రవేశ ప్రకటనలను జారీ చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు కన్వీనర్, యాజమాన్య కోటాలను విడివిడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.ఆయుష్ మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తగ్గిన కటాఫ్ స్కోర్ ఆధారంగా అర్హత సాధించిన అభ్యర్థులు ఏప్రిల్ 2న ఉదయం 8 గంటల నుంచి ఏప్రిల్ 3 మధ్యాహ్నం 2 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తుతో పాటు సంబంధిత ధృవీకరణ పత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్ సైట్ ను చూడాలని యూనివర్సిటీ వర్గాలు సూచించాయి.