హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ : తమిళనాడులో 3 రోజుల పాటు పర్యటించిన సీఎం కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈనెల 13న మధ్యాహ్నం సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో తమిళనాడుకు వెళ్లారు. తిరుచ్చి శ్రీరంగంలోని రంగనాథస్వామిని కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్మంగళవారం సాయంత్రం తమిళనాడు సీఎం ఎం.కే.స్టాలిన్ తో కేసీఆర్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. బుధవారం ఉదయం చెన్నై కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ గవర్నర్ నరసింహన్ ను సీఎం కేసీఆర్ పరామర్శించారు. అనంతరం చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు వచ్చారు.