ఓయూ పీజీ కోర్సుల పరీక్ష ఫీజుకు తేదీలు ఖరారు 

ఓయూ పీజీ కోర్సుల పరీక్ష ఫీజుకు తేదీలు ఖరారు

వరంగల్ టైమ్స్ , ఎడ్యుకేషన్ డెస్క్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ఫ్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎంఏ, ఎంకామ్ , ఎమ్మెస్సీ, ఎంఎస్ డబ్ల్యూ, ఎంలిబ్ ఐఎస్సీ, ఎంజే అండ్ ఎంసీ తదితర కోర్సుల మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును ఈ నెల 22 లోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చని చెప్పారు. రూ. 300 అపరాధ రుసుముతో 28 వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను మే 10 నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్ సైట్ www.osmania.ac.in లో చూడవచ్చని ఆయన తెలిపారు.