ఉత్కంఠ పోరులో ఆర్సీబీ సూపర్ విక్టరీ 

ఉత్కంఠ పోరులో ఆర్సీబీ సూపర్ విక్టరీ

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : రాజస్థాన్ తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( ఆర్సీబీ) సూపర్ విక్టరీ సాధించింది. 170 రన్స్ లక్ష్యంతో బరిలో దిగిన ఆ టీంకు డుప్లెసిస్ (29), అనూజ్ రావత్ (26) మంచి ఆరంభమే అందించారు. అయితే ఇద్దరూ భారీ స్కోర్లు చేయకుండానే వెనుతిరిగారు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ (5) కూడా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల రనౌట్ అయ్యాడు.ఉత్కంఠ పోరులో ఆర్సీబీ సూపర్ విక్టరీ ఆ తర్వాతి బంతికే డేవిడ్ విల్లే (0)ను చాహల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. షెర్ఫానే రూథర్ ఫర్డ్ (5) కూడా సింగిల్ డిజిట్ స్కోరుకే అవుటవడంతో ఆర్సీబీ ఓటమి దాదాపు ఖాయమైందని అంతా అనుకున్నారు. అయితే షాబాజ్ అహ్మద్ (45), దినేష్ కార్తీక్ ( 23 బంతుల్లో 44 నాటౌట్ ) అద్భుతమైన ఆటతీరుతో ఆర్సీబీని విక్టరీ వైపు తీసుకెళ్లారు.

ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 19వ ఓవర్ లో డీకే రెండు ఫోర్లు బాదడంతో బెంగళూరు విజయానికి 3 రన్స్ కావాల్సి వచ్చాయి. 20 వ ఓవర్ తొలి బంతికే సిక్సర్ బాదిన హర్షల్ పటేల్ ( 9నాటౌట్ ) బెంగళూరుకు విజయాన్ని అందించాడు. ఇది ఈ ఐపీఎల్ లో రాజస్థాన్ కు తొలి ఓటమి కాగా, బెంగళూరుకు రెండో విజయం. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్ , చాహల్ చెరో రెండు వికెట్లు తీయగా, సైని ఒక వికెట్ తీశాడు.