చెన్నైపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

చెన్నైపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయందుబాయ్ : చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 137 పరుగల లక్ష్యాన్ని ఢిల్లీ 19.4 ఓవర్లలో ఛేదించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఓపెనర్ శిఖర్ ధావన్ ( 39 : 35 బంతుల్లో 3×4, 2×6) రాణించాడు. పృథ్వీ షా (18), రిషబ్ పంత్ (15), రిపాల్ పటేల్ (18) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయారు. శ్రేయస్ అయ్యర్ (2), అక్షర్ పటేల్ (5) విఫలమయ్యారు. ఆఖరులో వచ్చిన షిమ్రోన్ హెట్ మైర్ (28), రబాడ(4) పరుగులతో జట్టును విజయ తీరాలకు చేర్చారు.

చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 2, శార్దూల్ ఠాకూర్ 2, దీపక్ చాహర్ , జోష్ హేజిల్ వుడ్, డ్వేన్ బ్రావో తలా ఒక్కో వికెట్ తీశారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ( సీఎస్కే) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. అంబటి రాయుడు ( 55 : 43 బంతుల్లో 5×4, 2×6 ) అర్ధ శతకంతో రాణించాడు. చివరి ఓవర్లలో రాయుడు వేగం పెంచడంతో ఢిల్లీ ముందు చెన్నై మోస్తరు లక్ష్యాన్ని ఉంచగల్గింది.

రాబిన్ ఉతప్ప(19), కెప్టెన్ ధోని (18) ఫర్వాలేదనిపించారు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (13), డుప్లెసిస్ (10) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయారు. మొయిన్ అలీ (5) విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 2, రవిచంద్రన్ అశ్విన్, అన్రిచ్ నోర్జే, అవేశ్ ఖాన్ తలా ఒక్కో వికెట్ తీశారు.